4.5 కేజీలు బంగారంతో పట్టుబడిన మహిళ
- November 11, 2015
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేసి.. ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బ్యాంకాక్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చిన మహిళను తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు సోదా నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు ప్రయాణికురాలి నడుముకు బంగారపు బిస్కెట్లు చుట్టుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బంగారపు బిస్కెట్లు స్వాధీనం చేసుకుని.. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బంగారం 4.5 కేజీలు ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన మహిళ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరం అని చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







