'కణం' ట్రైలర్ విడుదల.!
- November 18, 2017
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'కణం'. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ను శనివారం విడుదల చేశారు. సస్పెన్స్తో కూడిన సన్నివేశాలతో ట్రైలర్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 'మా సారీ మా. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్' అనే డైలాగ్తో.. నాగశౌర్య, సాయిపల్లవి పెళ్లితో ట్రైలర్ ప్రారంభమైంది. 'కృష్ణ నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నువ్వు నమ్మలేకపోవచ్చు. కానీ అది నిజం.. నువ్వు అన్ని మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను' అంటూ సాయిపల్లవి నాగశౌర్యతో అంటూ కనిపించారు. ఎవరో హత్యకు గురి కావడం, హంతకుడి కోసం పోలీసులు గాలించడం, ఇంటిలో పూజలు చేయడం..
తదితర సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఓ పాప చుట్టూ ఈ సినిమా కథ సాగేలా తెలుస్తోంది. 'కణం' చిత్రానికి సీఎస్ సామ్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో 'కరు' అనే టైటిల్తో విడుదల చేయబోతున్నారు. సాయిపల్లవి 'ఫిదా' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె నాని సరసన 'ఎం.సి.ఎ' చిత్రంలో నటిస్తున్నారు. నాగశౌర్య 'ఛలో' చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







