కార్నిష్ ను వదులుకోవద్దు
- November 12, 2015
బహ్రైన్ లోని ప్రఖ్యాత అల్ ఫతే కోర్నిచే ను పెట్టుబడుల నిర్వహణ కోసం బహరేన్ ముమ్తలకత్ కంపెనీ వారికి అప్పగించవద్దని, పార్లమెంటు సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పార్లమెంటు యొక్క ప్రజావసరాలు మరియు పర్యావరణ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఆడెల్ అల్ అసూమి, ఈ భూమిని పనులు, మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళికా వ్యవహారాల శాఖ వారి అధీనoలోనే ఉంచాలని కోరుతూ ఒక అత్యవసర ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం వద్ద అల్ ఫతే కోర్నిచే మరియు పాత సిట్రా బ్రిడ్జ్ అనే రెండు బహిరంగ తీరప్రాంత ప్రదేశాలు ఉన్నాయని, వాటిలో పాత సిట్రా బ్రిడ్జ్ కుటుంబ విహార ప్రాంతంగా ఉందని; కోర్నిచే గనుక ఆ కంపెనీ వారి చేతులోకి వెళ్ళినట్లయితే, ఇక ప్రజలు దాని ముఖం కూడా చూడలేరని ఆయన వివరించారు. సమాచారం, పార్లమెంటు మరియు షూరా వ్యవహారాల శాఖా మంత్రి ఇసా అల్ హమ్మాదీ, మరింత సమాచారాన్ని సేకరించడం కోసం ఈ కార్యక్రమాన్ని మరో వారం రోజులపాటు వాయిదా వేయవలసినదిగా విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







