ఎయిరిండియా పిల్లలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
- November 12, 2015
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఎయిరిండియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన తమ విమానాల్లో ప్రయాణించే పిల్లలకు ఆ తర్వాత ఓ డ్రా నిర్వహించి, అందులో విజేతలకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వనున్నారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతి సాధించిన వాళ్లకు ఢిల్లీ- శాన్ఫ్రాన్సిస్కో- ఢిల్లీ మార్గంలో వెళ్లేందుకు నాలుగు ఎకానమీ టికెట్లు ఇస్తారు. రెండో బహుమతి సాధించినవాళ్లకు నాలుగు ఉచిత స్వదేశీ రిటర్న్ టికెట్లు ఇస్తారు. మూడో బహుమతి సాధించిన వాళ్లకు ఒక డొమెస్టిక్ సెక్టార్ టికెట్పై నాలుగు అప్గ్రేడ్ ఓచర్లు ఇస్తారు. ఈ ఆఫర్ 12 ఏళ్ల లోపు వయసున్న వాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ డ్రా తీస్తారు. పిల్లలు తమ ప్రయాణ వివరాలను ఎయిరిండియా కార్యాలయానికి నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. దీంతోపాటు నవంబర్ 14న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసే పిల్లలకు ప్రత్యేకంగా స్వీట్లు, బొమ్మలు కూడా ఇవ్వనున్నారట.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







