ఎయిరిండియా పిల్లలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
- November 12, 2015
బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఎయిరిండియా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన తమ విమానాల్లో ప్రయాణించే పిల్లలకు ఆ తర్వాత ఓ డ్రా నిర్వహించి, అందులో విజేతలకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వనున్నారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతి సాధించిన వాళ్లకు ఢిల్లీ- శాన్ఫ్రాన్సిస్కో- ఢిల్లీ మార్గంలో వెళ్లేందుకు నాలుగు ఎకానమీ టికెట్లు ఇస్తారు. రెండో బహుమతి సాధించినవాళ్లకు నాలుగు ఉచిత స్వదేశీ రిటర్న్ టికెట్లు ఇస్తారు. మూడో బహుమతి సాధించిన వాళ్లకు ఒక డొమెస్టిక్ సెక్టార్ టికెట్పై నాలుగు అప్గ్రేడ్ ఓచర్లు ఇస్తారు. ఈ ఆఫర్ 12 ఏళ్ల లోపు వయసున్న వాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ డ్రా తీస్తారు. పిల్లలు తమ ప్రయాణ వివరాలను ఎయిరిండియా కార్యాలయానికి నవంబర్ 30వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. దీంతోపాటు నవంబర్ 14న ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసే పిల్లలకు ప్రత్యేకంగా స్వీట్లు, బొమ్మలు కూడా ఇవ్వనున్నారట.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









