న్యూ కెలడోనియాలో భూకంపం, సునామి హెచ్చరికలు జారీ!
- November 20, 2017
న్యూ కెలడోనియా: న్యూకెలడోనియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు అయినట్లు సమాచారం.దీంతో పాటు సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడ సముద్రంలోని అలలు ఐదడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సునామీ వల్ల 300 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూ కెలడోనియాలో తూర్పు తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ రాజధాని నౌమియో ఉంది. న్యూ కెలడోనియాలో ఆదివారం అర్థ రాత్రి నుంచి పలుమార్లు భూమి కంపించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







