సౌదీ అరేబియా ఎడారిలో వింత రాతి కట్టడాలు
- November 20, 2017_1511187275.jpg)
రియాద్: ' ఈ నల్లని రాళ్ళలో..ఏ కన్నులూ దాగినో ...ఈ బండల మాటున... ఏ గుండెలు మోగినో ' అంటూ సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు అమరశిల్పి జక్కన మాదిరిగా కూనిరాగాలు తీస్తున్నారు. వారి ఆసక్తికి అసలు కారణమేమిటంటే...ఎటూ చూసినా భారీ ఇసుక గుట్టలు..మొక్క మోడు మొలవని ఆ సౌదీ అరేబియా ఎడారిలో కొన్ని రాళ్లతో ఒక క్రమ పద్ధతిలో పేర్చబడిన నిర్మాణాలు వారికి ఎంతో వింతను కలిగిస్తున్నాయి. అవి ఏమిటో తెలియక సౌదీ పురాతత్వ శాస్త్రవేత్తలు తలలు పెట్టుకొంటున్నారు. ఈ రహస్యం కనిపట్టేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ, ఆ మిస్టరీ వీడటం లేదు. ఇక వారికి అంతర్జాలంలో గూగుల్ తల్లి శరణమైంది. గూగుల్ మ్యాపింగ్ ద్వారా వాటిని గుర్తించారు. ఏవో రాళ్లు శ్రద్ధగా పేర్చినట్లు కనపడుతున్న ఆ ఆకారంలో ఏదో దేవ రహస్యం దాగుందని..అవి ఏ కాలానికి చెందినవని... ఆ రాళ్ళ వరుసలను పేర్చినవారు ఎవరై ఉంటారో తేల్చుకునేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేవిడ్ కెన్నడీ అనే ప్రముఖ పురాతత్వవేత్తను అధికారులు ప్రత్యేకంగా సౌదీకి రప్పించారు. ఆయన తన బృందం సహయంతో ఆ నిర్మాణాలపై పరిశోధనలు జరిపారు. ఆ రాళ్లు 9 వేల ఏళ్ల క్రితం అలా పేర్చాబడ్డాయని కెన్నడీ తేల్చేశారు. అయితే అవి ఆనాటి మానవుల సమాధులు అయి ఉండవచ్చని కెన్నడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం