రస్ అల్ ఖైమాలో ఏషియన్ కార్మికుడి సజీవ సమాధి
- November 21, 2017
రస్ అల్ ఖైమా: 30 ఏళ్ళ కార్మికుడొకరు సజీవ సమాధి అయిన ఘటన రస్ అల్ ఖైమాలో చోటు చేసుకుంది. ఓ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, ల్యాండ్స్లైడ్ చోటు చేసుకుని, కార్మికుడు అందులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో బాధితుడ్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ జాబి మాట్లాడుతూ, ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరిని తమ రెస్క్యూ టీమ్స్ రక్షించాయని చెప్పారు. ఉదయం 10.35 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిందనీ, ఆ వెంటనే అంబులెన్స్, పారా మెడిక్స్, రెస్క్యూ టీమ్స్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు మొహమ్మద్ అబ్దుల్లా. ఇద్దరు వ్యక్తుల్ని రెస్క్యూ టీమ్స్ రక్షించగలిగాయనీ, వారికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఓ వ్యక్తిని మాత్రం కాపాడలేకపోయామని చెప్పారు. చట్ట పరమైన చర్యల నిమిత్తం రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంబంధిత శాఖలకు ఈ కేసును రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం