తిరుపతి-నాగర్సోల్ ప్రత్యేక రైళ్లు వయా గుంటూరు
- November 21, 2017
గుంటూరు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరుపతి - నాగర్సోల్ - తిరుపతి ప్రత్యేక రైళ్లను గుంటూరు డివిజన్ మీదగా నడపనున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్ 07417 తిరుపతి-నాగర్సోల్ ప్రత్యేక రైలు డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 7.30గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15కు గుంటూరు వచ్చి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, సికింద్రాబాద్ మీదగా మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు నాగర్సోల్ చేరుకొంటుంది.
నెంబర్ 07418 నాగర్సోల్ - తిరుపతి ప్రత్యేక రైలు డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో (శనివారం) రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు వచ్చి సోమవారం వేకువజామున 4 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్, మూడు త్రీటైర్, ఎనిమిది స్లీపర్క్లాస్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్ భోగీలు ఉంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







