తిరుపతి-నాగర్సోల్ ప్రత్యేక రైళ్లు వయా గుంటూరు
- November 21, 2017
గుంటూరు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరుపతి - నాగర్సోల్ - తిరుపతి ప్రత్యేక రైళ్లను గుంటూరు డివిజన్ మీదగా నడపనున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్ 07417 తిరుపతి-నాగర్సోల్ ప్రత్యేక రైలు డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 7.30గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15కు గుంటూరు వచ్చి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, సికింద్రాబాద్ మీదగా మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు నాగర్సోల్ చేరుకొంటుంది.
నెంబర్ 07418 నాగర్సోల్ - తిరుపతి ప్రత్యేక రైలు డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో (శనివారం) రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు వచ్చి సోమవారం వేకువజామున 4 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్, మూడు త్రీటైర్, ఎనిమిది స్లీపర్క్లాస్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్ భోగీలు ఉంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు.
తాజా వార్తలు
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!







