తిరుపతి-నాగర్సోల్ ప్రత్యేక రైళ్లు వయా గుంటూరు
- November 21, 2017
గుంటూరు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరుపతి - నాగర్సోల్ - తిరుపతి ప్రత్యేక రైళ్లను గుంటూరు డివిజన్ మీదగా నడపనున్నట్లు రైల్వే సీనియర్ డీసీఎం కె.ఉమామహేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్ 07417 తిరుపతి-నాగర్సోల్ ప్రత్యేక రైలు డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 7.30గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.15కు గుంటూరు వచ్చి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, సికింద్రాబాద్ మీదగా మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు నాగర్సోల్ చేరుకొంటుంది.
నెంబర్ 07418 నాగర్సోల్ - తిరుపతి ప్రత్యేక రైలు డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో (శనివారం) రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు వచ్చి సోమవారం వేకువజామున 4 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్, మూడు త్రీటైర్, ఎనిమిది స్లీపర్క్లాస్, ఆరు జనరల్ సెకండ్ క్లాస్ భోగీలు ఉంటాయని సీనియర్ డీసీఎం తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









