పూజా కార్యక్రమాలు జరుపుకున్న సుధీర్బాబు - ఇంద్రగంటి చిత్రం
- November 23, 2017మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన `జెంటిల్మేన్` ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ దర్శక నిర్మాతలు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో గురువారం ఉదయం జరిగాయి. మణిరత్నం `చెలియా` సినిమాలో నాయికగా నటించి అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 10గా ఈ సినిమాను నిర్మిస్తోంది.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ``గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించాం. ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో మా సంస్థలో మేం నిర్మించిన `జెంటిల్మేన్` ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సుధీర్బాబుగారికి పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. డిసెంబర్ 11 నుంచి నిరవధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమా విడుదల చేస్తాం. హైదరాబాద్, హిమాచల్ప్రసాద్, ముంబైలోని సరికొత్త లొకేషన్లలో తెరకెక్కిస్తాం`` అని చెప్పారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ``అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది`` అన్నారు.
సుధీర్బాబు, అదితిరావు హైదరి, నరేశ్, తనికెళ్ల భరణి, రోహిణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్: పి.బాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్. మనోజ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు, ప్రొడక్షన్ కంట్రోలర్: చంద్రమోహన్, కో డైరక్టర్: కోట సురేశ్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: యస్ . రవీందర్, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్; డైరక్టర్ ఆఫ్ పొటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన- దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్