నేడు హైదరాబాద్ లో సన్బర్న్ పార్టీ
- November 24, 2017
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం సన్బర్న్ పార్టీ జరగనుంది. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పార్టీకి పోలీసులు అనుమతినిచ్చారు. కాగా... ఈ పార్టీలో పాల్గొనేందుకు రూ. 7500 నుంచి లక్ష రూపాయల వరకూ టికెట్ల ధరలు నిర్ణయించారు. అయినప్పటికీ హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కాగా... 100 పబ్లు ఒకచోట చేరితే వచ్చే శబ్ధం ఒక సన్బర్న్ పార్టీకి సమానమని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ సన్బర్న్ పార్టీకి అనుమతినివ్వడంపై పలు విమర్శలొస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ... పార్టీలకు అనుమతినిస్తున్న ప్రభుత్వం కొలువుల కొట్లాట సభకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ప్రశ్నిస్తున్నాయి. అలాగే సన్బర్న్ పార్టీ నిర్వహణ వల్ల స్టేడియంలోని గ్రౌండ్ పాడవుతుందని అథ్లెట్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే రోజూ జాతీయ క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ను సన్బర్న్పార్టీకి అనుమతివ్వటం సరికాదని వాకర్స్ పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







