నేడు హైదరాబాద్ లో సన్బర్న్ పార్టీ
- November 24, 2017
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం సన్బర్న్ పార్టీ జరగనుంది. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పార్టీకి పోలీసులు అనుమతినిచ్చారు. కాగా... ఈ పార్టీలో పాల్గొనేందుకు రూ. 7500 నుంచి లక్ష రూపాయల వరకూ టికెట్ల ధరలు నిర్ణయించారు. అయినప్పటికీ హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కాగా... 100 పబ్లు ఒకచోట చేరితే వచ్చే శబ్ధం ఒక సన్బర్న్ పార్టీకి సమానమని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ సన్బర్న్ పార్టీకి అనుమతినివ్వడంపై పలు విమర్శలొస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ... పార్టీలకు అనుమతినిస్తున్న ప్రభుత్వం కొలువుల కొట్లాట సభకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ప్రశ్నిస్తున్నాయి. అలాగే సన్బర్న్ పార్టీ నిర్వహణ వల్ల స్టేడియంలోని గ్రౌండ్ పాడవుతుందని అథ్లెట్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే రోజూ జాతీయ క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ను సన్బర్న్పార్టీకి అనుమతివ్వటం సరికాదని వాకర్స్ పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







