అవయవ దాన పత్రంపై రకుల్ ప్రీత్ సింగ్ సంతకం

- November 24, 2017 , by Maagulf
అవయవ దాన పత్రంపై రకుల్ ప్రీత్ సింగ్ సంతకం

మనిషి మరణించినా మరొకరికి వెలుగుల్ని పంచొచ్చు అని మొదలైన అవయవదాన కార్యక్రమం రాను రాను వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మనిషి శరీరంలోని చాలా భాగాలు మరణానంతరం మరికొద్దిమందికి ఉపయోగించవచ్చని తెలిపింది. అవయవ దానంపై అందరికీ అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భాగ్యనగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న నిర్వహించే 10కే రన్‌లో పాల్గొనమంటూ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ అభిమానుల్ని కోరుతోంది. ఈ సందర్భంగా తాను కూడా అవయదానం చేస్తున్నట్లు ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com