టాలీవుడ్లోకి మరో హీరోయిన్..
- November 24, 2017
ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరని ఏలేశారు.. ఆ తరువాత మహేష్ బాబు మంచి నటుడిగా ఎదుగుతున్నాడు. వారసులు ఎంతమంది ఉన్నా అదృష్టం మాత్రం ఒక్కళ్లనే వరించింది. అందుకే పెద్ద కొడుకు రమేష్, కూతురు మంజులు సినిమాల్లో రాణించలేక పోయారు. అయితే మంజుల చేసింది కొద్ది సినిమాల్లోనే అయినా మంచి పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తను నటించిన 'షో' మూవీకి అవార్డులు కూడా వచ్చాయి. ఆ తరువాత నిర్మాతగా మారినా నిలదొక్కుకోలేకపోయింది. ఇప్పుడు మంజుల దర్శకురాలిగా మరో కొత్త పాత్ర పోషించబోతోంది. సందీప్ కిషన్ని హీరోగా పెట్టి ఓ మూవీని తెరకెక్కిస్తోంది. మంజుల కూతురు జాన్వి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. నటనను వారసత్వంగా పుణికి పుచ్చుకున్న జాన్వి ఈ సినిమాలో నటించిన తీరు చిత్ర యూనిట్ ప్రశంసలకు నోచుకుంది. ఎప్పుడూ షూటింగ్ చాయలక్కూడా రాని జాన్వి మొదటి షూట్లో కొంత నెర్వస్ ఫీలయినా ఆ తరువాత ఎటువంటి భయం లేకుండా నటించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి జాన్వీ కూడా ఇండస్ట్రీకి దొరికిన మరో ఆణిముత్యంగా టాలీవుడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







