టాలీవుడ్లోకి మరో హీరోయిన్..
- November 24, 2017
ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వెండి తెరని ఏలేశారు.. ఆ తరువాత మహేష్ బాబు మంచి నటుడిగా ఎదుగుతున్నాడు. వారసులు ఎంతమంది ఉన్నా అదృష్టం మాత్రం ఒక్కళ్లనే వరించింది. అందుకే పెద్ద కొడుకు రమేష్, కూతురు మంజులు సినిమాల్లో రాణించలేక పోయారు. అయితే మంజుల చేసింది కొద్ది సినిమాల్లోనే అయినా మంచి పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తను నటించిన 'షో' మూవీకి అవార్డులు కూడా వచ్చాయి. ఆ తరువాత నిర్మాతగా మారినా నిలదొక్కుకోలేకపోయింది. ఇప్పుడు మంజుల దర్శకురాలిగా మరో కొత్త పాత్ర పోషించబోతోంది. సందీప్ కిషన్ని హీరోగా పెట్టి ఓ మూవీని తెరకెక్కిస్తోంది. మంజుల కూతురు జాన్వి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. నటనను వారసత్వంగా పుణికి పుచ్చుకున్న జాన్వి ఈ సినిమాలో నటించిన తీరు చిత్ర యూనిట్ ప్రశంసలకు నోచుకుంది. ఎప్పుడూ షూటింగ్ చాయలక్కూడా రాని జాన్వి మొదటి షూట్లో కొంత నెర్వస్ ఫీలయినా ఆ తరువాత ఎటువంటి భయం లేకుండా నటించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి జాన్వీ కూడా ఇండస్ట్రీకి దొరికిన మరో ఆణిముత్యంగా టాలీవుడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









