రియల్‌ టైం గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం

- November 26, 2017 , by Maagulf
రియల్‌ టైం గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం

అమరావతి: వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... అధికారులు, ప్రజలతో ఎక్కడి నుంచైనా వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటుచేయడం జరిగిందని, విపత్తులు, ప్రమాదాల సమయంలో సెంటర్‌ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com