హాస్టల్ విద్యార్థులు ప్రతీరోజూ జాతీయగీతం పాడాల్సిందే
- November 27, 2017
జైపూర్ : ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులు ప్రతీరోజూ ఉదయం ఏడు గంటలకు జాతీయ గీతాన్ని పాడాలని రాజస్థాన్ రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని 800 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో ఉంటున్న 40వేల మంది విద్యార్థులు ప్రతీరోజూ ఉదయాన్నే ఏడు గంటలకు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీత్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకే ఉదయం జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశించినట్లు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజే చెప్పారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థులందరూ సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయాలని వసుంధరా రాజే సర్కారు ఆదేశించింది. ఈ ఆదేశాలపై కొందరు కోర్టుకెళ్లగా దాన్ని విద్యార్థుల ఐచ్ఛికానికి వదిలివేసింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







