మీడియాకు షాక్ ఇచ్చిన కేటీఆర్
- November 27, 2017
మంత్రి కేటీఆర్ మీడియాకు షాక్ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతని కట్టుదిటం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని వచ్చి పర్యటనని ముగించుకొని వెళ్లే వరకు ఏ చిన్ని అడ్డంకి రాకుండా ముందుగానే పక్కా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
మెట్రో ప్రారంభోత్సవానికి మీడియాకు అనుమతి ఉండదని చెప్పి షాక్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. సోమవారం మంత్రి కేటీఆర్ మియాపూర్లో ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎస్పీజీ సూచనల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని, మెట్రో ప్రారంభోత్సవానికి మీడియాకు అనుమతి ఉండదని తెలిపారు. అయితే, దూరదర్శన్ నుంచి ఫీడ్ వస్తుందన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







