కువైట్‌లో మృతిచెందిన సిద్దిపేట జిల్లా వాసి

- November 28, 2017 , by Maagulf
కువైట్‌లో మృతిచెందిన సిద్దిపేట జిల్లా వాసి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా రూరల్‌ మండల పరిధిలోని నారాయారవుపేట గ్రామానికి చెందిన గూడా రాజిరెడ్డి(40) కువైట్‌లో మృతి చెందాడు. రాజిరెడ్డి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం కువైట్‌ వెళ్లాడు. అక్కడ ఓ పరిశ్రమలో కార్మికునిగా పని చేస్తున్నాడు. 5 రోజుల క్రితం ఆయనకు గుండె పోటు రావడంతో చికిత్స చేసి స్టెంట్‌ వేశారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. రాజిరెడ్డికి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com