'రారండోయ్..' సినిమా రీమేక్ లో నిఖిల్..
- November 30, 2017
అక్కినేని నాగ చైత్యన , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం ఎలాంటి హిట్ సాధించిందో తెలియంది కాదు. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ , ఇప్పుడు కన్నడలో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్ లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా నటిస్తున్నాడు. కన్నడ లో 'సీతారామ కళ్యాణం' పేరుతో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కుమారస్వామి నిర్మించబోతున్నాడు.
నిఖిల్ గత ఏడాది రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'జాగ్వార్' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కన్నడ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. తొలి సినిమాతో యాక్షన్ హీరో అయిపోదామని చూసిన నిఖిల్ కు ఎదురు దెబ్బ తగలడం తో ఇప్పుడు ఫ్యామిలీ కథ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి నిఖిల్ కు ఈ చిత్రం ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







