'డల్లాస్'లో ఇండియన్ బాలిక హత్య...
- November 30, 2017
ఒక అనాథాశ్రమం నుంచి బాలికను సాకుతామని తీసుకువచ్చి ఆమెను అత్యంత పైశాచికంగా హత్య చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డల్లాస్ లోని ఓ కల్వర్టు కింద పారవేసినట్లు ఓ జంట ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివరాలను చూస్తే గత అక్టోబరు నెలలో మూడేళ్ల తమ పెంపుడు కుమార్తె షెరీన్ మాథ్యూస్ బాలిక తమకు కనిపించడంలేదంటూ అన్ మాథ్యూస్, ఆమె భర్త వెస్లీ మాథ్యూస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ భారత సంతతి(కేరళ)కి చెందినవారు.
వంట గదిలో ఆమెను వదిలేసి తాము విధులకు వెళ్లామనీ, తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదని చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డల్లాస్ లోని ఓ కల్వర్టులో బాలిక మృత దేహాన్ని కనుగొన్నారు. బాలిక శవానికి పోస్టుమార్టం నిర్వహించగా అందులో బాలికపై దాడి జరిగినట్లు తేలింది.
తొడ ఎముక, మోకాలి కింది ఎముక విరిగిపోయి వున్నాయి. ఇంకా శరీరంలో చాలాచోట్ల ఎముకలు విరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో సదరు జంటను పోలీసులు విచారించగా వారు మాత్రం తాము బాలికను వంట గదిలో వదిలేసి వెళ్లామని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం బాలిక మృతికి వీరిద్దరే కారణమని అరెస్టు చేశారు. మరోవైపు పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై దాడి జరిగినట్లు వైద్యులు చెపుతున్నారు. ఐతే కోర్టులో ఈ జంట తరపున వాదనలు చేసిన న్యాయవాది బలమైన వాదన వినిపించారు. దీనితో కట్టాల్సిన జరిమానాలో తగ్గింపు చేశారు. అలాగే శిక్ష కూడా తగ్గే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









