బంగళాఖాతంలో వాయుగుండం..
- November 30, 2017
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరం వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణుకుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనం హడలిపోతున్నారు. చెన్నై శివారులోని.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చుట్టూ కమ్మేసిన వాన నీటిని దాటుకుని.. బయటకు వచ్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రోడ్లన్ని జలమయం కావడంతో.. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంకను ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. సముద్రంలో ప్రస్తుతం గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరికొద్ది రోజులు వానలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా ఏడు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో సెలవుల మీద వెళ్లిన రెవెన్యూ శాఖ, పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









