పోలవరం విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్ధం కావడంలేదు: బాబు

- November 30, 2017 , by Maagulf
పోలవరం విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్ధం కావడంలేదు: బాబు

అమరావతి : కేంద్రం లేఖతో పోలవరంపై గంధరగోళం నెలకొని ఉంది. ఈమేరకు ఇవాళ సీఎం చంద్రబాబు పోలవరంపై మాట్లాడుతూ...కేంద్రం ఆపమంటే పోలవరం టెండర్లు ఆపేస్తానని అన్నారు. పోలవరం పనులు పూర్తి చేస్తానంటే ఆ బాధ్యత కేంద్రానికే అప్పజెప్పి నమస్కారం పెడతానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ఆరు నెలలు ఆగిపోతే మళ్లీ దారిపట్టించడం కష్టమన్నారు. బిజేపి పార్టీ మిత్రపక్షం కాబట్టే మరింత సహనంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులో అర్ధం కావడంలేదన్నారు. కేంద్రం లేఖపై నితిన్ గడ్కరీతో మాట్లాడే ప్రయత్నం చేశానని, గడ్కరీ లండన్ నుంచి రాగానే పోలవరం పై మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com