'కాపు'లకు రిజర్వేషన్లపై వ్యతిరేకత..భగ్గుమన్న బీసీ సంఘాలు
- December 02, 2017
కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ పలు బీసీ సంఘాలు రాష్ట్రంలో ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను సంఘాలు దగ్ధం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర కోపోద్రిక్తులైన బీసీలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. టైర్లకు నిప్పంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వ నిర్ణయం బీసీలకు నష్టం చేకూర్చేలా ఉందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీల మెరుపు ధర్నాతో కలెక్టరేట్ అట్టుడికింది.
కాపులను బీసీ-ఫ్ కేటగిరీలో చేరుస్తూ 5శాతం రిజర్వేషన్లు కల్పించినంత మాత్రాన బీసీల ప్రయోజనాలు దెబ్బతినవని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు.ప్రస్తుతం బీసీలకు కొనసాగుతున్న రిజర్వేషన్ లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. షెడ్యూల్-9లో కాపులకు అదనంగా 5శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. కాపు రిజర్వేషన్ విద్య, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకే మాత్రమే పరిమితమవుతుందని పేర్కొన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...







