శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం
- December 04, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం. అమెరికా వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద 19 బుల్లెట్లు లభించాయి. నితిన్ రెడ్డి అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది..అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్కు చెందిన ఓటుకూరు నితిన్ రెడ్డి.. ఖతార్ ఎయిర్ లైన్సులో అమెరికా వెళ్లేందుకు వచ్చాడు. అతని లగేజీ బ్యాగును స్కాన్ చేయగా..ఒకటి కాదు ఏకంగా 19 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో నితిన్ రెడ్డి అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది. జంతువులను వేటాడానికి ఉపయోగించే హంటింగ్ బుల్లెట్లని పోలీసులు చెబుతున్నారు. బుల్లెట్లతో విమాన ప్రయాణం నేరం కాబట్టి నితిన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- భద్రతా సహకారంపై బహ్రెయిన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- యన్బు, జాజాన్లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’







