జయలలిత సమాధి వద్ద విశాల్
- December 04, 2017
చెన్నై: తమిళనాట మరో రాజకీయ చదరంగానికి సమయం ఆసన్నమైంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 21న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో తమిళ రాజకీయం వేడెక్కుతోంది. సినీ నటుడు విశాల్ కూడా ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ప్రజల్లో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది. విశాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ జయలలిత సానుభూతిపరుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాడనే సరికొత్త వాదన తెరపైకొచ్చింది.
విశాల్ ఇవాళ నామినేషన్ వేసే ముందుగా జయలలిత సమాధి వద్దకెళ్లి నివాళులర్పించాడు. అంతేకాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కె కామరాజు, ఎంజీఆర్లకు కూడా విశాల్ శ్రద్ధాంజలి ఘటించాడు. దీంతో విశాల్ పోటీ వెనుక అన్నాడీఎంకే హస్తం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనను విశాల్ మద్దతుదారులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రానికి సేవ చేసిన నాయకుల ఆశీర్వాదం కోసం మాత్రమే విశాల్ వెళ్లారని, దాని వెనుక ఎలాంటి రాజకీయ వ్యూహం లేదని చెప్పుకొస్తున్నారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







