శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం
- December 04, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం. అమెరికా వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద 19 బుల్లెట్లు లభించాయి. నితిన్ రెడ్డి అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది..అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్కు చెందిన ఓటుకూరు నితిన్ రెడ్డి.. ఖతార్ ఎయిర్ లైన్సులో అమెరికా వెళ్లేందుకు వచ్చాడు. అతని లగేజీ బ్యాగును స్కాన్ చేయగా..ఒకటి కాదు ఏకంగా 19 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో నితిన్ రెడ్డి అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది. జంతువులను వేటాడానికి ఉపయోగించే హంటింగ్ బుల్లెట్లని పోలీసులు చెబుతున్నారు. బుల్లెట్లతో విమాన ప్రయాణం నేరం కాబట్టి నితిన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!