శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం

- December 04, 2017 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం. అమెరికా వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద 19 బుల్లెట్లు లభించాయి. నితిన్ రెడ్డి అనే ప్రయాణికుడి వద్ద బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది..అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. 

హైదరాబాద్‌కు చెందిన ఓటుకూరు నితిన్ రెడ్డి.. ఖతార్ ఎయిర్ లైన్సులో అమెరికా వెళ్లేందుకు వచ్చాడు. అతని లగేజీ బ్యాగును స్కాన్ చేయగా..ఒకటి కాదు ఏకంగా 19 బుల్లెట్లు లభ్యమయ్యాయి.  దీంతో నితిన్ రెడ్డి అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది. జంతువులను వేటాడానికి ఉపయోగించే హంటింగ్ బుల్లెట్లని పోలీసులు చెబుతున్నారు. బుల్లెట్లతో విమాన ప్రయాణం నేరం కాబట్టి నితిన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com