రేపటి నుండి సెట్స్ పైకి 'సైరా'
- December 05, 2017
మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ సైరా చిత్రం రేపటి నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్ లో తొలి షెడ్యూల్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి సంబంధించి మేకోవర్ పూర్తిగా మార్చుకోగా, టెస్ట్ షూట్ కూడా పూర్తైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా 150 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. సినిమాకి సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ అందరిని సెలక్ట్ చేసినప్పటికి చివరి మూమెంట్ లో రెహమాన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని యూనిట్ ఆలోచనలో పడింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలతో తెరకెక్కనున్న సైరా చిత్రం బాహుబలి రికార్డులు తిరగరాసేలా రూపొందనున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!