జట్టులో యువీ లేకపోవటంతో ఆగ్రహానికి గురైన అభిమానులు
- December 05, 2017
దిల్లీ: శ్రీలంకతో టీ20, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ల కోసం బీసీసీఐ సోమవారం సాయంత్రం జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. యో యో టెస్టు పాసైన యువీ తిరిగి జట్టులో స్థానం దక్కించుకుంటాడని యూవీ అభిమానులు ఆశపడ్డారు. కానీ, సెలక్టర్లు అతనివైపు మొగ్గు చూపలేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
దీంతో నెటిజన్లు ఇప్పటి వరకు యో యో టెస్టు పాసవ్వలేదని యువీని జట్టులోకి తీసుకోలేపోయం అని చెప్పిన సెలక్టర్లు ఇప్పుడు ఎందుకు ఎంపిక చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'ఇటీవల కాలంలో యువరాజ్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాదు యో యో టెస్టు పాసైన అనంతరం అతడు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఏదైనా టోర్నీలో ఆడి ఉంటే ఎలా ఆడుతున్నాడన్న దానిపై ఓ అంచనాకి వచ్చేవాళ్లం. కానీ అతడు ఎలాంటి టోర్నీ ఆడలేదు. అందుకే ఎంపిక చేయలేదు' అని ప్రసాద్ వివరించారు.
2019 ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలనుకుంటున్నానని, ఏ ఫార్మాట్లో ఆడతానో తెలియదని, ఆ తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా అని యువీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







