సోలార్ విద్యుత్తు వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న యోగా గురు
- December 05, 2017
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరో కీలకమైన వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. పతంజలి ఉత్పత్తులతో ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు సైతం గుండెల్లో గుబులు పుట్టించిన రాందేవ్ తాజాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంపై దృష్టిపెట్టారు. సోలార్ విద్యుత్తు వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతీ ఇంటికి సోలార్విద్యుత్ లక్ష్యంగా భారీ పెట్టుబడితో సోలార్ కరెంట్ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. స్వదేశీ ఉద్యమానికి అనుగుణంగా సోలార్పవర్ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్నామనిఇ పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తద్వారా భారతదేశంలో ప్రతి ఇంటికి సోలార్విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తున్నామన్నారు. నాణ్యతలో రాజీపడకుండా భారతదేశంలో సౌర ఫలకాలను తయారుచేస్తాము. కానీ చైనీస్ సోలార్ ప్యానెల్ ధరల యుద్ధంలోకి రామని ఆయన చెప్పారు. డిమాండ్ కనుగుణంగా వ్యాపార విస్తరణను పరిశీలిస్తామని బాలకృష్ణ చెప్పారు. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెకాల్నజీస్తో ఒప్పందం చేసుకుంది.
రూ.100కోట్ల పెట్టుబడితో గ్రేటర్ నోయిడాలోని కర్మాగారాన్ని 20 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నెలకొల్పనుంది. తదుపతి రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!