జవనరి 26న 'రోబో 2.O' టీజర్ విడుదల
- December 06, 2017
శంకర్ ఆలోచనలను ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. సర్ ప్రైజులు, షాకులతో టు పాయింట్ ఓ ను తెరకెక్కిస్తూ సినీజనాలందరినీ కన్ ఫ్యూజ్ చేస్తున్నాడు. రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసి సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని అయోమయంలో పడేసిన శంకర్, జవనరి 26కు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు.
శంకర్ ఇమాజినేషన్ కు బాక్సాఫీస్ ఎప్పుడూ సర్ ప్రైజ్ అవుతూనే ఉంటుంది. ఈ గ్రేట్ మేకర్ కాన్వాస్ పై చేసే మేజిక్స్ కు ప్రేక్షకులు థ్రిల్ అవుతుంటారు. అంత ఫ్రెష్ థాట్స్ తో సినిమాలు తీసే శంకర్, 450కోట్లతో రోబో సీక్వెల్ స్టార్ట్ చేయ్యగానే టు పాయింట్ ఓ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమా ఇండియన్ సినిమాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనే టాక్ వచ్చింది. సెట్స్ లో ఉండగానే భారీ బజ్ క్రియేట్ చేసిన టు పాయింట్ ఓ టీజర్ ను జనవరి26న లాంచ్ చేస్తున్నాడు
టు పాయింట్ ఓ సినిమా జనవరి26నే రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. కానీ గ్రాఫికల్ వర్క్ బాలెన్స్ ఉండడంతో సినిమాను ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేశారు. దీంతో సూపర్ స్టార్ విజువల్ వండర్ కోసం వెయిట్ చేస్తోన్న తలైవా అభిమానులు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఆ నిరాశను తగ్గించి, సినిమాపై ఉన్న బజ్ ను మరింత పెంచడానికి జనవరి26న టీజర్ రిలీజ్ చేస్తున్నాడు శంకర్. మరి టు పాయింట్ ఓ ఏప్రిల్ రిలీజ్ అనగానే రిలీజ్ డేట్స్ ను రీచెక్ చేసుకుంటోన్న సమ్మర్ మూవీస్ లో టుపాయింట్ ఓ ను తట్టుకుని ఎన్నిసినిమాలు నిలబడతాయో చూడాలి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!