భాగ్యనగరం లో నిక్కర్ బ్యాచ్ హల్ చల్..!
- December 08, 2017
హైదరాబాద్: ఈ మద్య దొంగలు రక రకాలుగా వ్యూహాలు పన్నుతూ అందినంత దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో నిక్కర్ బ్యాచ్ అడుగుపెట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసుల్లో సైతం కలవరం మొదలైంది. సుమారుగా 4 నుంచి 10 మంది కలసి ఓ ముఠాగా సంచరిస్తుంటారు. పగటి పూట బెలూన్లు, ఇతర ఆట వస్తువులను విక్రయిస్తూ తాళం వేసి ఉన్న సంపన్నుల ఇళ్ల సమాచారాన్ని ముఠాలోని మహిళా సభ్యులు పసిగడతారు. రాత్రి వేళల్లో ఆ ఇళ్లలో చోరీలు చేస్తూ అందినంత దోచుకుంటున్నారు.
వీరు తమ వెంట కత్తులు, ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో సంచరిస్తుంటారని పేర్కొంటున్నారు. ఏమీ లేకపోతే చివరికి రాళ్లదాడికి సైతం వీరు వెనుకాడరు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత లోపల ఎవరైనా ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే వారిని భయపెట్టి తాళ్లతో కట్టేయడం దాడి చేయడం..అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే మియాపూర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈ ముఠా సంచరిస్తోంది.
ఈ ప్రాంతంలో పలు చోరీలు జరగ్గా, దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు పలు అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే విషయం వెలుగు చూసింది. మరోవైపు పోలీసులు రాత్రి వేళల్లో ఓంటరి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు నగరంలోని అన్ని కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!