ఆధార్-పాన్ అనుసంధానం: మార్చి నెలాఖరు వరకు గడువు పెంపు
- December 09, 2017
ఆధార్ నెంబర్ను పాన్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు లింక్ చేసేందుకు డిసెంబర్ 31వరకు యూఐడీఏ గడువు విధించింది. తాజాగా ఆ గడువును 2018 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. తొలుత ఈ గడువును 2017 జూలై 31వ తేదీ వరకు ప్రకటించగా... ఆ తర్వాత దాన్ని ఆగస్టు 31 వరకు, అనంతరం డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
అయితే తాజాగా ఆ గడువును మరోసారి 2018 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో.. ప్రజల సౌకర్యార్థం కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం మీద 33 కోట్ల మంది పాన్ ఖాతాదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 13.28 కోట్ల మంది తమ పాన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు.
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను పొందే ఆధార్ నెంబర్ అనుసంధానంపై మార్చి 31వరకు గడువును పొడిగించేందుకు సిద్ధమేనని ఇటీవల కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. అంతేగాకుండా ఇప్పటివరకు ప్రకటించిన గడువులోపు తమ పాన్ కార్డును ఆధార్తో ప్రజలు అనుసంధానం చేసుకోలేకపోయారనే విషయం ఆర్థిక శాఖ దృష్టికి వెళ్లడంతో గడువును పెంచినట్లు అధికారులు తెలిపారు. అందుకే అనుసంధానం చేయని వారికి మరో అవకాశం కల్పిస్తూ వచ్చే ఏడాది 2018 మార్చి 31వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి