బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- September 17, 2025
యూఏఈ: ఫ్రెంచ్ రిటైల్ దిగ్గజం క్యారీఫోర్ తాజాగా కువైట్లో తన సేవలకు ముగింపు పలికింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుంచి కువైట్ లో కార్యాకలాపాలను ముగిస్తున్నామని, ఇన్నాళ్లు సహకరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
క్యారీఫోర్ కు 40 దేశాల్లో 14 వేలకుపైగా స్టోర్స్ ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో స్టోర్స్ ను నిర్వహిస్తుంది. ఫ్రాంచైజ్ హక్కులను పొందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ ద్వారా 1995లో మధ్యప్రాచ్యానికి వచ్చింది క్యారీఫోర్.
కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ లోనూ కార్యాకలాపాలను ముగించిన క్యారీఫోర్, జోర్డాన్లో తన స్టోర్లను నవంబర్ 2024 నుండి మూసివేసింది. కాగా, ఇప్పుడు యూఏఈలో కూడా తన స్టోర్లను మూసివేసే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, యూఏలో ప్రాచుర్యం పొందిన సూపర్ మార్కెట్లలో ఒకటైన క్యారీఫోర్.. దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









