బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- September 17, 2025
యూఏఈ: ఫ్రెంచ్ రిటైల్ దిగ్గజం క్యారీఫోర్ తాజాగా కువైట్లో తన సేవలకు ముగింపు పలికింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుంచి కువైట్ లో కార్యాకలాపాలను ముగిస్తున్నామని, ఇన్నాళ్లు సహకరించిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
క్యారీఫోర్ కు 40 దేశాల్లో 14 వేలకుపైగా స్టోర్స్ ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో కూడా పెద్ద సంఖ్యలో స్టోర్స్ ను నిర్వహిస్తుంది. ఫ్రాంచైజ్ హక్కులను పొందిన మాజిద్ అల్ ఫుట్టైమ్ ద్వారా 1995లో మధ్యప్రాచ్యానికి వచ్చింది క్యారీఫోర్.
కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ లోనూ కార్యాకలాపాలను ముగించిన క్యారీఫోర్, జోర్డాన్లో తన స్టోర్లను నవంబర్ 2024 నుండి మూసివేసింది. కాగా, ఇప్పుడు యూఏఈలో కూడా తన స్టోర్లను మూసివేసే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, యూఏలో ప్రాచుర్యం పొందిన సూపర్ మార్కెట్లలో ఒకటైన క్యారీఫోర్.. దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









