జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- September 17, 2025
జెనీవా: ఖతార్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దోహాపై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడిని ఖండిస్తూ 78 దేశాలు జెనీవాలోని UN మానవ హక్కుల మండలిలో సంయుక్త ప్రకటన చేశాయి. జెనీవాలోని UNకు దక్షిణాఫ్రికా శాశ్వత ప్రతినిధి రాయబారి మక్సోలిసి న్కోసి ఈ మేరకు వెల్లడించారు.
సెప్టెంబర్ 9న దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత కౌన్సిల్ 60వ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఖతార్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు ఉమ్మడి ప్రకటన మద్దతును తెలియజేసింది. కౌన్సిల్ లోని ఆయా దేశాల ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. శాంతియుత దేశంపై బలప్రయోగం చేయడమేనని పేర్కొన్నారు.
శాంతి మధ్యవర్తిత్వంలో ముందుండే ఖతార్ ను దాడులకు లక్ష్యంగా చేసుకోవడంపై పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని హెచ్చరించాయి. మధ్యవర్తిత్వం వహించే దేశాలపై దాడులను పర్యవేక్షించి నివేదించాలని, అంతర్జాతీయ చట్టం ప్రకారం వారి రక్షణను బలోపేతం చేయాలని సంతకందారులు మానవ హక్కుల మండలి.. UN సెక్రటరీ జనరల్, మానవ హక్కుల హైకమిషనర్ను కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









