జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- September 17, 2025
జెనీవా: ఖతార్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దోహాపై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడిని ఖండిస్తూ 78 దేశాలు జెనీవాలోని UN మానవ హక్కుల మండలిలో సంయుక్త ప్రకటన చేశాయి. జెనీవాలోని UNకు దక్షిణాఫ్రికా శాశ్వత ప్రతినిధి రాయబారి మక్సోలిసి న్కోసి ఈ మేరకు వెల్లడించారు.
సెప్టెంబర్ 9న దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత కౌన్సిల్ 60వ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఖతార్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు ఉమ్మడి ప్రకటన మద్దతును తెలియజేసింది. కౌన్సిల్ లోని ఆయా దేశాల ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. శాంతియుత దేశంపై బలప్రయోగం చేయడమేనని పేర్కొన్నారు.
శాంతి మధ్యవర్తిత్వంలో ముందుండే ఖతార్ ను దాడులకు లక్ష్యంగా చేసుకోవడంపై పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని హెచ్చరించాయి. మధ్యవర్తిత్వం వహించే దేశాలపై దాడులను పర్యవేక్షించి నివేదించాలని, అంతర్జాతీయ చట్టం ప్రకారం వారి రక్షణను బలోపేతం చేయాలని సంతకందారులు మానవ హక్కుల మండలి.. UN సెక్రటరీ జనరల్, మానవ హక్కుల హైకమిషనర్ను కోరింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక