జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- September 17, 2025
జెనీవా: ఖతార్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దోహాపై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడిని ఖండిస్తూ 78 దేశాలు జెనీవాలోని UN మానవ హక్కుల మండలిలో సంయుక్త ప్రకటన చేశాయి. జెనీవాలోని UNకు దక్షిణాఫ్రికా శాశ్వత ప్రతినిధి రాయబారి మక్సోలిసి న్కోసి ఈ మేరకు వెల్లడించారు.
సెప్టెంబర్ 9న దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత కౌన్సిల్ 60వ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఖతార్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు ఉమ్మడి ప్రకటన మద్దతును తెలియజేసింది. కౌన్సిల్ లోని ఆయా దేశాల ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. శాంతియుత దేశంపై బలప్రయోగం చేయడమేనని పేర్కొన్నారు.
శాంతి మధ్యవర్తిత్వంలో ముందుండే ఖతార్ ను దాడులకు లక్ష్యంగా చేసుకోవడంపై పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని హెచ్చరించాయి. మధ్యవర్తిత్వం వహించే దేశాలపై దాడులను పర్యవేక్షించి నివేదించాలని, అంతర్జాతీయ చట్టం ప్రకారం వారి రక్షణను బలోపేతం చేయాలని సంతకందారులు మానవ హక్కుల మండలి.. UN సెక్రటరీ జనరల్, మానవ హక్కుల హైకమిషనర్ను కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









