రేపట్నుంచే దుబాయ్ సఫారీలోకి ప్రవేశం
- December 10, 2017
దుబాయ్:రేపే, అంటే డిసెంబర్ 12న సఫారీ పార్క్ సందర్శకులకోసం తెరచుకోనుంది. దుబాయ్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. లీజర్ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖాలెద్ అల్ సువైది మాట్లాడుతూ, సఫారీ పార్క్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంటుందని చెప్పారు. ఇందులో 2,500 జంతువులు, 250 ఇతర జీవాలు ఉంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వీటిని తీసుకొచ్చారు. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. మూడేళ్ళ లోపు చిన్నారులకు, 60 ఏళ్ళ పైబడ్డ వృద్ధులకు ప్రవేశం ఉచితం. మూడేళ్ళ పైబడ్డ పిల్లలకు 30 దిర్హామ్లు, పెద్దలకు 85 దిర్హామ్లు టిక్కెట్ వసూలు చేయబడుతుంది. సఫారీ కాదనుకుంటే పిల్లలకు 20, పెద్దలకు 50 దిర్హామ్లు చెల్లించాలి. 2020 నాటికి సఫారీ పార్క్లో మొత్తం జంతువుల సంఖ్య 5,000కి చేరనుందనీ, రోజుకి 10,000 మంది విజిటర్స్కి వీలుగా సఫారీ పార్క్ని రూపొందించామని అల్ సువైది చెప్పారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!