రేపట్నుంచే దుబాయ్ సఫారీలోకి ప్రవేశం
- December 10, 2017
దుబాయ్:రేపే, అంటే డిసెంబర్ 12న సఫారీ పార్క్ సందర్శకులకోసం తెరచుకోనుంది. దుబాయ్ మునిసిపాలిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. లీజర్ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖాలెద్ అల్ సువైది మాట్లాడుతూ, సఫారీ పార్క్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంటుందని చెప్పారు. ఇందులో 2,500 జంతువులు, 250 ఇతర జీవాలు ఉంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వీటిని తీసుకొచ్చారు. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. మూడేళ్ళ లోపు చిన్నారులకు, 60 ఏళ్ళ పైబడ్డ వృద్ధులకు ప్రవేశం ఉచితం. మూడేళ్ళ పైబడ్డ పిల్లలకు 30 దిర్హామ్లు, పెద్దలకు 85 దిర్హామ్లు టిక్కెట్ వసూలు చేయబడుతుంది. సఫారీ కాదనుకుంటే పిల్లలకు 20, పెద్దలకు 50 దిర్హామ్లు చెల్లించాలి. 2020 నాటికి సఫారీ పార్క్లో మొత్తం జంతువుల సంఖ్య 5,000కి చేరనుందనీ, రోజుకి 10,000 మంది విజిటర్స్కి వీలుగా సఫారీ పార్క్ని రూపొందించామని అల్ సువైది చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







