ట్యాక్సీ సర్వీసుల ఫేర్స్‌ ప్రకటించిన మువసలాత్‌

- December 11, 2017 , by Maagulf
ట్యాక్సీ సర్వీసుల ఫేర్స్‌ ప్రకటించిన మువసలాత్‌

మస్కట్‌: మువసలాత్‌ ట్యాక్సీ సర్వీసులు 1 ఒమన్‌ రియాల్స్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి ఈ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (మవసలాత్‌) ప్రకటించింది. ప్రమోషనల్‌ ఆఫర్స్‌లో భాగంగా 1 ఒమన్‌ రియాల్స్‌ నుంచి ఫేర్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ ధరలు మాల్స్‌ నుంచి వర్తిస్తాయి. శనివారం నుంచి గురువారం వరకు కాల్‌ ట్యాక్సీ సర్వీసులు 1.2 ఒమన్‌ రియాల్స్‌కి అందుబాటులో ఉంటాయి. ప్రతి కిలోమీటర్‌కి అదనంగా 300 బైజాస్‌ చెల్లించాల్సి ఉంటుంది. సాయంత్రం సమయాల్లో 1.3 ఒమన్‌ రియాల్స్‌, 1.5 ఒమన్‌ రియాల్స్‌ నుంచి ధరలు ప్రారంభమవుతాయి. కిలోమీటర్‌కి 350 బైజాస్‌ చెల్లించాలి. మాల్స్‌ కోసం 125 ట్యాక్సీలను ప్రారంభించగా, 2018 జనవరి నుంచి 100 కార్లను ఎయిర్‌పోర్ట్‌ ట్యాక్సీలుగా అందుబాటులోకి తెస్తారు. ఎయిర్‌పోర్ట్‌ ట్యాక్సీల ధరల్ని ముందు ముందు తగ్గిస్తామని ఇప్పటికే మవసలాత్‌ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా గత ఏడాది మువసలాత్‌, మర్హాబాలకు ట్యాక్సీ సర్వీసులకోసం అనుమతి లభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com