విమానం హైజాక్‌ చేస్తారంటూ ఫోన్‌కాల్‌.. శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ భద్రత

- December 12, 2017 , by Maagulf
విమానం హైజాక్‌ చేస్తారంటూ ఫోన్‌కాల్‌.. శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ భద్రత

శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీహార్‌ నుంచి సానియా భాహర్‌ అనే మహిళ శంషాబాద్‌ పోలీసులకు ఫోన్‌ చేసి విమానం హైజాక్‌ విషయంపై మాట్లాడింది. ఈ నెల 24న లక్నోకు చెందిన షోయబ్‌ అనే యువకుడు శంషాబాద్‌ నుంచి జెడ్డాకు వెళ్తున్నాడని, అతనికి ఐఎస్‌ఐతో సంబంధముందని చెప్పింది. పేలుడు పదార్థాలతో విమానం ఎక్కి హైజాక్‌ చేసే ప్లాన్‌ చేస్తున్నాడని అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముంబై పోలీసులు సానియా భాహర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటు షోయబ్‌ అనే వ్యక్తిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com