ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ భద్రత : సీపీ శ్రీనివాసరావు

- December 14, 2017 , by Maagulf
ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ భద్రత : సీపీ శ్రీనివాసరావు

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టూ 3వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. ప్రపంచ మహాసభల నేపథ్యంలో ఎల్బీస్టేడియంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం నిజాం కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 18న ఎల్బీస్టేడియంలో సినీ విభావరి సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. రేపటి నుంచి జరిగే మహాసభలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com