ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరిన్ని నగరాల్లో దాడులకు సిద్ధంగా ఉన్నారు
- November 17, 2015
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరిన్ని నగరాల్లో దాడులకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నన్ వెల్లడించారు. ఐఎస్ ఉగ్రవాదులు వరుస దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, అందులో భాగంగానే తొలిదాడి ప్యారిస్ నగరంపై చేశారని, త్వరలో మరిన్ని చోట్ల దాడులు చేసే ప్రమాదం స్పష్టంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కుట్రలను బయటపెట్టడం, వాటిని అడ్డుకోవడం కూడా అంత సులభం ఏమీ కాదన్నారు. యూరప్లో చాలామంది తమ భాగస్వాములు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పటివరకు ఎంతమంది ఇరాక్, సిరియాలకు వెళ్లి మళ్లీ తిరిగొచ్చారో తెలియడం లేదని, వీళ్లందరిపైనా కన్నేసి ఉంచాలంటే చిన్న విషయం కాదని బ్రెన్నన్ తెలిపారు. ప్యారిస్ ఉగ్రదాడులకు కుట్ర చేసిన వారి కోసం ఫ్రాన్స్, బెల్జియం సహా అనేక ఇతర దేశాలు కూడా తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే ఈలోపే తాము అక్కడి నుంచి సురక్షితంగా బయటకు వెళ్లిపోయామని కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ సమావేశంలో బ్రెన్నన్ పాల్గొని ఈ విషయాలు వెల్లడించారు. వాషింగ్టన్ మీద కూడా దాడి చేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించడంతో.. వాళ్లకు కేవలం ఇరాక్, సిరియా లాంటి ప్రాంతాల్లోనే కాక.. ఇతర ప్రాంతాల్లో కూడా శాఖలు ఉండి ఉంటాయని, వాళ్లే ప్యారిస్ అనంతర దాడులకు సిద్ధం అవుతూ ఉండి ఉంటారని భావిస్తున్నారు. ప్యారిస్ దాడులకు ముందునుంచి వాళ్లు సిద్ధమైన తీరు చూస్తుంటే.. కొన్ని నెలల పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆత్మాహుతి బెల్టులు, ఇవన్నీ చేయడానికి తగినంత మంది మనుషులు.. ఇలా అన్ని వనరులను సమకూర్చుకుని ఉంటారని బ్రెన్నన్ విశ్లేషించారు. మధ్యప్రాచ్యంలో ఎక్కడో ఓచోట, లేదా యూరప్లో భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు ఇటీవలే హెచ్చరించాయి. ఈలోపే ప్యారిస్ మీద ఉగ్రదాడులు జరిగాయి.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









