జనవరి 12న జై సింహ రిలీజ్
- December 15, 2017
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జైసింహా. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ నాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సి. కళ్యాణ్ నిర్మాత. ఇటీవల పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.దుబాయ్లో రెండు పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ మొత్తం పూర్తయింది. బాలకృష్ణ, నయనతార, నటాషా జోషీలపై ఈ పాటలను రూపకల్పన చేశాం. జానీ, బృంద మాస్టర్ల నేతృత్వంలో యురోపియన్ డాన్సర్లతో తెరకెక్కించిన ఈ పాటలు జైసింహాలో ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. చిరంతన్ భట్ మంచి సంగీతాన్ని అందిం చారు. డిసెంబర్ నెలాఖరకు పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ముందు నిర్ణయించినట్లు జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల