పాకిస్తాన్ చర్చిలో ఉగ్రదాడి, ఐదుగురి మృతి

- December 17, 2017 , by Maagulf
పాకిస్తాన్ చర్చిలో ఉగ్రదాడి, ఐదుగురి మృతి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలోని చర్చిలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చర్చి ప్రాంగణం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. క్రిస్మస్‌ సమీపిస్తున్న నేపథ్యంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com