పాకిస్తాన్ చర్చిలో ఉగ్రదాడి, ఐదుగురి మృతి
- December 17, 2017
పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్థాన్లోని క్వెట్టా ప్రాంతంలోని చర్చిలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చర్చి ప్రాంగణం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. క్రిస్మస్ సమీపిస్తున్న నేపథ్యంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల