వెబ్ సైట్ లకు గూగుల్ హెచ్చరిక.!
- December 17, 2017ఇటీవల కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న అసత్య వార్తలకు(ఫేక్ న్యూస్) అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ చర్యలు ప్రారంభించింది. నెటిజన్లను తప్పుదోవ పట్టించే అలాంటి వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. ఫేక్ న్యూస్ అందించే వెబ్సైట్లను న్యూస్ వెబ్సైట్ల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. వెబ్సైట్కు సంబంధించిన యజమాని వివరాలు, దేశం, నెటిజన్లను తప్పుదోవ పట్టించడం ఇలా ఏ చర్యకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది. నెటిజన్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సౌకర్యవంతంగా చదువుకునేలా వార్తలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ తెలిపింది. 'మీకోసం మిమ్మల్ని మీరు తప్పుగా చూపించుకోవద్దు. వెబ్సైట్లు గూగుల్ న్యూస్తో సహా ఎవర్నీ తప్పుగా చూపించవద్దు. తప్పులు, యాజమాని వివరాలు గోప్యంగా ఉంచడం, నెటిజన్లను తప్పుదోవ పట్టించేలా చేయటం, ఒక దేశంలో ఉండి మరో దేశంలో ఉన్నట్లు కంప్యూటర్ ఐపీలను చూపించటం ఇక సహించం' అని గూగుల్ తెలిపింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..