బీచ్ ఫెస్టివల్కు ముస్తాబవుతున్న కాకినాడ తీరం
- December 17, 2017కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎన్టీఆర్ సాగర తీరం బీచ్ ఫెస్టివల్కు ముస్తాబవుతోంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ సంబరాన్ని నిర్వహించడానికి పర్యాటక శాఖ, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలోని 13 జిల్లాల పర్యాటకులను ఆకర్షించేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల తొలిరోజు 19న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరి, రెండో రోజు 20న సినీ సంగీత నేపథ్య గాయకులతో స్టార్నైట్, ఆఖరి రోజు 21న స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సుమారు ఆరు లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సంబరాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభిస్తారు. మంత్రులు చినరాజప్ప, అఖిలప్రియ, కిమిడి కళావెంకట్రావు, శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం తదితరులు హాజరుకానున్నారు. పూల ప్రదర్శనతో పాటు జలక్రీడలు, హేలీరైడింగ్, పారాసైలింగ్, పారాగ్లైడింగ్, స్పీడ్బోట్లు, ఇసుకలో మోటారుసైకిల్ రైడింగ్ వంటి సాహస క్రీడలను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్