బ్యాడ్ వెదర్: దుబాయ్ సఫారీ మూసివేత
- December 17, 2017వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున దుబాయ్ సఫారీ పార్క్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం), వాతావరణ పరిస్థితుల్లో అప్పటికప్పుడు విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది గనుక, అప్రమత్తంగా ఉండాలని రెసిడెంట్స్కి సూచించింది. భారీ వర్ష పాతం పలు ప్రాంతాల్లో కురవనుందని ఎన్సిఎం హెచ్చరించింది. ఇప్పటికే దుబాయ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాక, దుబాయ్ సఫారీ పార్క్ యధాతథంగా సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని దుబాయ్ మునిసిపాలిటీ ప్రకటించింది. సఫారీ పార్క్లో జంతువుల భద్రత నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. డిసెంబర్ 12న ప్రారంభమైన దుబాయ్ సఫారీ పార్క్లో వివిధ రకాలైన 2,500 జంతువులు ఉన్నాయి. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ