హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- December 18, 2017
హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బైరామల్ గూడాలోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలంగా మారింది. ఎల్బీ నగర్ బైరామల్గూడలోని ఓ స్కాబ్ గోడౌన్లో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాం చేశారు.
గోడౌన్లో ప్లాస్టిక్ పదార్థాలు, సీసాలు ఉండటంతో ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో ప్రమాదం తప్పిందన్నారు. మూడు గోడౌన్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఆయన చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామన్నారు. గోడౌన్లో పాత ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో ప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన అంచనా వేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







