ఈ సభలే భావి తరానికి స్ఫూర్తి..చిరు

- December 18, 2017 , by Maagulf
ఈ సభలే భావి తరానికి స్ఫూర్తి..చిరు

ప్రపంచ తెలుగు మహా సభలను ఘనంగా నిర్వహించినందుకు తెలంగాణా సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినీ కుటుంబం తరఫున ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగు మహా సభల సందర్భంగా సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

ప్రత్యేకించి కేసీఆర్..తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు. ఈ సభలకు హాజరు కావలసిందిగా కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్ తన ఇంటికి స్వయంగా వచ్చి ఆహ్వానించినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన గుర్తుకు చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com