తాతయ్య మరణించినప్పుడు కీర్తి నన్ను పరామర్శించింది: సుమంత్
- December 19, 2017
'మళ్లీ రావా' అంటూ వచ్చిన హీరో సుమంత్ ఎట్టకేలకు మళ్లీ ఓ హిట్ అందుకున్నాడు. విజయోత్సాహంలో ఉన్న సుమంత్ తన తదుపరి చిత్రం కోసం కథలు వినే పనిలో ఉన్నారు. అయితే, ఆయన తొలిసారిగా తన వ్యక్తిగత విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆయన మాజీ సతీమణి, నటి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవడం వెనుక గల కారణాన్ని వెల్లడించారు. 2004లో పెళ్లి చేసుకున్న సుమంత్, కీర్తిరెడ్డి ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. అయితే, సుమంత్ ఈ విషయంపై మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఒకరినొకరు ఇష్డపడే పెళ్లి చేసుకున్నాం. కానీ, పెళ్లి తర్వాత మా అభిప్రాయాలు వేరని అర్థమైంది. అందుకే, పరస్పర అంగీకారంతో విడిపోయాం. అయితే, కీర్తి ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటాను. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి కావడం నాకు సంతోషంగా అనిపించింది. మా తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూసిన తర్వాత ఆమె పరామర్శకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆమెను కలవలేదు. అదే చివరిసారి అని సుమంత్ తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







