మీరు స్మార్ట్ బైక్స్ వాడుతున్నారా?
- December 19, 2017

మెట్రో రైల్.. హైదరాబాద్ నగర వాసులు ఎప్పటి నుంచో దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. మెట్రో రైల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. మియాపూర్ నుంచి నాగోల్ వరకు మొత్తం 30 కిలోమీటర్ల దూరం వరకు మెట్రో రైల్ ప్రారంభమైంది. ఈ మార్గంలో ఇప్పుడు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులు వాటిలో వెళ్తున్నారు కూడా. సరే. ఇదంతా ఓకే. తెలిసిందే కదా.. అంటరా..! అవునండీ.. మెట్రో రైల్ గురించి అందరికీ తెలుసు. కానీ ఆ రైల్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్బైక్లు.. అవేనండీ స్మార్ట్ సైకిల్స్.. వాటి గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ అవి ఎలా పనిచేస్తాయో, వాటిని ఎలా వాడుకోవచ్చో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్రోరైల్ స్టేషన్లయిన మియాపూర్, కేపీహెచ్బీ, నాగోల్, ఉప్పల్ స్టేడియం, హబ్సిగూడల వద్ద మాత్రమే ప్రస్తుతం ఈ స్మార్ట్బైక్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సైకిల్స్ను సైకుల్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ జర్మనీ నుంచి వాటిని తెప్పించింది. ఇందుకు గాను సైకుల్ సంస్థ మెట్రో రైల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే వారు ఈ స్మార్ట్ బైక్లను నగరానికి తెచ్చి మెట్రో రైల్ స్టేషన్ల వద్ద ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. వీటి ఉద్దేశం ఏమిటంటే. నగరంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడమే. అందుకోసమే ఈ సైకిల్స్ను ఏర్పాటు చేశారు.
అయితే ఈ స్మార్ట్ సైకిల్స్లో అంతర్గతంగా ఓ జీపీఎస్ పరికరం ఉంటుంది. దీని వల్ల ఎవరూ కూడా సైకిల్ను అంత తేలిగ్గా దొంగతనం చేయలేరు. చేసినా అందులో జీపీఎస్ ఉంటుంది కనుక దాని లొకేషన్ను ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో సైకిల్ దొంగలు ఇట్టే దొరుకుతారు. ఇక ఈ సైకిల్ను గంటకు ఇంత అని లెక్క కట్టి రెంట్కు ఇస్తారు. అందుకు గాను ఓ యాప్ను ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో సైకిల్ పై ఉండే కోడ్ను రీడ్ చేసి దాన్ని స్వారీ చేయవచ్చు. లేదంటే స్మార్ట్ కార్డును కొనవచ్చు. ఇలా రెండు రకాలుగా సైకిల్కు గాను మనం వాడినందుకు అయ్యే రెంట్ను చెల్లించి సైకిల్ను వాడుకోవచ్చు. ఒక స్టేషన్లో రెంట్కు తీసుకుంటే మరొక స్టేషన్లోనూ దాన్ని రిటర్న్ ఇవ్వవచ్చు. ఇక ఈ సైకిల్ను వాడేవారు మెంబర్షిప్ పొందితే మొదటి 30 నిమిషాల పాటు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. తరువాత 30 నుంచి 60 నిమిషాలకు రూ.10 చార్జి చేస్తారు. ఆ తరువాత ప్రతి 30 నిమిషాలకు రూ.15 వరకు చార్జి పడుతుంది. అదే 8 గంటల తరువాత అయితే 1 గంటకు రూ.100 చొప్పున అదనపు చార్జిలు పడతాయి. ఇక మెంబర్లు కాని వారు సైకిల్ను రెంట్కు తీసుకుంటే వారు మొదటి 30 నిమిషాలకు రూ.10 చెల్లించాలి. తరువాత 30 నుంచి 60 నిమిషాలకు రూ.25, ఆ తరువాత ప్రతి అదనపు 30 నిమిషాలకు రూ.30, 8 గంటల తరువాత ప్రతి గంటకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఇవీ.. మెట్రో రైల్ స్మార్ట్ సైకిల్ గురించిన వివరాలు..!
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







