బి12 ఇంజెక్షన్లతో బలం పెరుగుతుందా?
- December 19, 2017
బలం పెరుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, బరువు తగ్గటం ఆగుతుందని కొందరు విటమిన్ బి12 ఇంజెక్షన్లు తీసుకుంటుంటారు. ఇలాంటి ధోరణి పల్లెటూళ్లలో ఎక్కువ. నిజానికి రక్తంలో బి12 మోతాదులు మామూలుగా ఉంటే వీటితో ప్రయోజనమేమీ ఉండదు. అయితే బి12 మోతాదులు తగ్గినవారు మాత్రం దాన్ని భర్తీ చేసుకోవటం చాలా అవసరం. దీని లోపం వృద్ధుల్లో, పూర్తి శాకాహారుల్లో, బరువు తగ్గటానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నవారిలో తరచుగా కనబడుతుంది. తేలికైన రక్తపరీక్ష ద్వారా దీని మోతాదులు తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షను అంతగా చేయరు. అందువల్ల ఒకవేళ లోపం ఉన్నా కూడా ఏళ్లకేళ్లు తెలియకుండానే ఉండిపోతుంటుంది. బి12 లోపం మూలంగా రక్తహీనత తలెత్తుతుంది. లోపం స్వల్పంగా ఉంటే పైకి లక్షణాలేమీ కనబడవు. తీవ్రమవుతున్నకొద్దీ బలహీనత, అలసట, తల తేలిపోవటం, ఆయాసం, చర్మం పాలిపోవటం, నాలుక నునుపుగా మారటం, మలబద్ధకం, విరేచనాలు, ఆకలి తగ్గటం, గ్యాస్, తిమ్మిర్లు, మొద్దుబారటం, సరిగా నడవలేకపోవటం, చూపు తగ్గటం, కుంగుబాటు, మతిమరుపు, ప్రవర్తనలో మార్పుల వంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఇలాంటివి కనబడినప్పుడు డాక్టర్ను సంప్రదించి బి12 మోతాదులు పరీక్షించుకోవటం మంచిది. లోపం ఉంటే బి12 ఇంజెక్షన్లు, మాత్రలు బాగా ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







