సమంత చేతిలో 'జీ ఛానల్'
- December 20, 2017
ఇటీవలే నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న సమంత , ప్రస్తుతం పెళ్లి కి ముందు ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది. వాటితో పాటు తాజాగా ఓ టీవీ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి సైన్ చేసింది. ప్రముఖ జీ ఛానల్ వారు తమ ఛానెల్ అంబాసిడర్ గా సమంత ను తీసుకున్నారు. ఈ మేరకు ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారట. దీనికి గాను అమ్మడు కోటి 50 లక్షల రూపాయలు పారితోషకం తీసుకుందని తెలుస్తుంది.
ఒప్పందం ప్రకారం ఛానెల్ లో పలు సీరియళ్లు, సినిమాలకు ప్రచారం కల్పించబోతోంది సమంత. ఆమెపై షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. లేటెస్ట్ గా విడుదలైన సమంత మోడ్రన్, ట్రెడిషనల్ లుక్స్ పిక్స్ ఆ యాడ్ లోనివేనట. ఇంతకు ముందు తమన్నా ఈ ఛానల్ కు అంబాసిడర్ గా ఉంది. ఆమెతో చేసుకున్న ఒప్పందం పూర్తి కావడం తో ఇప్పుడు సమంత ను తీసుకున్నారు.
ప్రస్తుతం సమంత రంగస్థలం, మహానటి సినిమాలు చేస్తోంది. వీటితో పాటు తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేస్తూ, రెండు యాడ్ లలో కూడా నటిస్తుంది. ఇవి పూర్తి అయిన తర్వాత తనే నిర్మాతగా ఓ సినిమా ప్లాన్ చేస్తుంది ఈ అమ్మడు. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత కూడా బాగా బిజీ అయిపొయింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల