12 ఏళ్ల పిల్లాడు.. ప్రమాదాన్ని పసిగట్టాడు.. వందల మందిని కాపాడాడు

- December 20, 2017 , by Maagulf
12 ఏళ్ల పిల్లాడు.. ప్రమాదాన్ని పసిగట్టాడు.. వందల మందిని కాపాడాడు

ఆకతాయి పిల్లాడు.. ఆడుకుంటూ రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు... వాడు కూడా అనుకుని ఉండడు. నేను కూడా ఇంత మందిని కాపాడగలనని.. 12 ఏళ్ల ఆ బాలుడు రైలు ప్రమాదాన్నిముందుగానే పసిగట్టాడు. వందల మంది ప్రయాణీకుల ప్రాణాల్ని కాపాడాడు. 

ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. భీమ్ (12) అనే బాలుడు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒకచోట అతడికి రైలు పట్టా విరిగినట్లుగా కనిపించింది. ఆ చిన్ని హృదయం ఎందుకో రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి గేట్‌మెన్‌కి ఈ విషయాన్ని చెప్పాడు. స్పందించిన గేట్‌మెన్.. స్టేషన్ మాస్టర్‌కి విషయాన్ని వివరించి ఆ సమయానికి వస్తున్న రైలుని నిలిపివేశారు. సరిగ్గా అదే సమయంలో గోరక్‌పూర్-నర్కాటియగంజ్ లోకల్ వస్తోందని, మరో 15 నిమిషాల్లో అది అక్కడకు చేరుకునేదని తెలియజేశారు. అయితే ఆ బాలుడు ఈ విషయాన్ని పసిగట్టి తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమై ఘోర ప్రమాదాన్ని నివారించగలిగామని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అందరి ప్రాణాలను కాపాడిని ఆ బాలుడికి చదువు నిమిత్తంగా సాయం చేస్తామంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com