దుబాయ్ లో రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్

- December 20, 2017 , by Maagulf

దుబాయ్:నిజమాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీగౌడ్ దుబాయ్ లో రాహుల్ గాంధీ పర్యటన పరిశీలన లో బాగంగా దుబాయ్ లో ఉన్న అమిటి యునివర్సిటి లో ఉన్నతస్థాయి లో పనిచేస్తున్న నిజామబాద్ జిల్లాకు చెందిన మాణికభండార్ వాసి అయిన సమ్మేట సంతోష్ గౌడ్ మధు యాష్కీగౌడ్ను యునివర్సిటి కి ఆహ్వానించారు. మధు యాష్కీగౌడ్ ను యునివర్సిటి ప్రముకుఖులు వైస్ ఛాన్సలర్,సిఈఒ ఘనస్వాగతం పలికారు.ఆ తర్వాత యునివర్సిటి బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు.అలాగే యునివర్సిటీ లో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను, అత్యధునిక ప్రయోగాశాలను పరిశీలించారు.అదేవిధంగా  యునివర్సీటీ విద్యార్థినీ  విద్యార్తులూ అయిన కార్తీక్, సాహిత్ రెడ్డి, పవన్  మరియు మిగతా అందూబాటులో  వున్న రెండు తెలుగు రాష్టాల విద్యార్థినీ  విద్యార్థులతో ముచ్చటించి వారి యొక్క విద్యా విధానం, ఉద్యోగ అవకాశాలు అడిగి తెలుసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com